జోహనెస్బర్గ్, జనవరి 26 : ఫ్రీడమ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత్ బౌలర్లు పేస్ తో అదరగొట్టారు. ఇంతకు ముందు రెండు టెస్ట్ ల మాదిరి మన బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. బుమ్రా(5/54), భువనేశ్వర్ (3/44), ధాటికి సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 65.5 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. 6/1 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ఆరంభించిన సౌతాఫ్రికా జట్టులో ఆమ్లా (61), నైట్ వాచ్ మెన్ రబాడ (30) పోరాడారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించిన టీమిండియా రెండోరోజు ఆట ముగిసేసమయానికి 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. మురళీ విజయ్(13), లోకేశ్ రాహుల్ (16) క్రీజులో ఉన్నారు.