క్రిస్ట్చర్చ్, జనవరి 25 : ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదైంది. అండర్ డాగ్ గా బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్, ఆతిధ్య న్యూజిల్యాండ్ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది. క్వార్టర్ ఫైనల్లో అఫ్గానిస్థాన్ జట్టు కివీస్ పై భారీ విజయం సాధించి టోర్నీలో సెమీస్ కు చేరింది. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో కివీస్, అఫ్గాన్ బౌలర్లు ముజీబ్, అహ్మద్ ధాటికి 28.1ఓవర్లలో కేవలం 107 పరుగులకే ఆలౌటైంది.