హైదరాబాద్, జనవరి 24 : టీమిండియా యువ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఫేస్బుక్ ఖాతాను 14 ఏళ్ల బాలుడు హ్యాకింగ్ చేశాడు. విషయం గుర్తించిన ఆయన వెంటనే సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా కుటుంబీకులకు పరిచయస్తుడైన ఓ బాలుడు ఫేస్ బుక్ పాస్ వర్డ్ తెలుసుకొని ఈ పని చేసినట్లు గుర్తించారు. అయితే తెలిసిన వాడే కావడంతో సిరాజ్ కేసును ఉపసంహరించుకున్నారు.