ఆ తొమ్మిది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి : రేవంత్‌ రెడ్డి

SMTV Desk 2018-01-23 16:59:02  revanth reddy, mla disqualification, congress leader, trs mla, ec, president

హైదరాబాద్, జనవరి 23 : కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి తొమ్మిది మంది తెరాస ఎమ్మెల్యేలపై లాభదాయక పదవులలో కొనసాగారని ఎన్నికల సంఘం, రాష్ట్రపతికి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఢిల్లీలో లాభదాయక పదవుల్లో కొనసాగుతున్న 21 మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటీవల ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫార్సు చేయడంతో దానికి ఆయన ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్‌ ప్రభుత్వంలో ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటు కార్యదర్శులుగా నియమించిందని, అలాగే, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో కొనసాగారని రేవంత్‌ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.