వాషింగ్టన్, జనవరి 23 : అమెరికాలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య విభేదాల వల్ల ద్రవ్య వినిమయ బిల్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అగ్రరాజ్యం బడ్జెట్ సంబంధిత ప్రతిష్టంభన తొలగిపోయింది. ప్రభుత్వ కార్యకలాపాలకు తాత్కాలికంగా నిధులు అందించే బిల్లును ఉభయ సభలు ఆమోదించిన అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చింది. దీంతో మూడు రోజుల షట్డౌన్కు తెర పడింది. దీంతో సోమవారం ఉదయం నుంచి అమెరికా ప్రభుత్వం మళ్లీ యథాతథంగా కార్యకలాపాలు ప్రారంభించింది.