హైదరాబాద్, జనవరి 23 : దేశంలో అన్ని రాష్ట్రాల లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిస్తున్నారు. ఈ జమిలి ఎన్నికలకు ఎన్నికల సంఘం సైతం సుముఖత వ్యక్తం చేస్తుంది. కాగా ఈ విషయంపై ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.." ఒకే ఏడాది లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం మంచిదే. కానీ ఆ ప్రక్రియకు రాజ్యాంగ సవరణ అవసరం. దీని వల్ల ప్రతీకార రాజకీయాలు, ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు వంటివి తగ్గుతాయి. అయితే 2019లో ఏకకాల ఎన్నికలు కష్టమే. వచ్చే 2024లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది” అని వ్యాఖ్యానించారు.