న్యూఢిల్లీ, జనవరి 22: చైనా కంపెనీ వివో సరికొత్త ఫీచర్స్ తో త్వరలో ఓ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతుంది. వివో ఎక్స్ 20 ప్లస్ యూడీ పేరుతో ఈ మొబైల్ ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ మొబైల్ ప్రత్యేకత ఏంటంటే.. స్క్రీన్ మీదే ఫింగర్ప్రింట్ స్కానర్ రావడం. దీని ధర రూ. 36,770గా ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. వివో ఎక్స్ 20 ప్లస్ యూడీ ఫీచర్లు ఇలా.. # 18:9 యాస్పెక్ట్ రేషియో ఉన్న 6.43 ఇంచ్ భారీ ఫుల్ వ్యూ డిస్ప్లే # 2160x1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ # 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ # 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా # 3905 ఎంఏహెచ్ బ్యాటరీ