మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన అన్నాహజరే

SMTV Desk 2018-01-22 11:42:20  anna hajare, comments on pm modi,

ముంబై, జనవరి 22 : ప్రధాని నరేంద్ర మోదీపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజరే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తానూ రాసిన లేఖలకు మోదీ స్పందించకపోవడంపై.. మోదీకి అహం పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఓ ర్యాలిలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. "ఇప్పటికి ప్రధానికి 30 కి పైగా లేఖలు రాశాను. కాని ఒక్కదానికి కూడా ఆయన సమాధానమివ్వలేదు. ఆయనకు అహం బాగా పెరిగిపోయింది. అందుకే సమాధానం ఇవ్వడం లేదు" అని వ్యాఖ్యానించారు. రైతుల కోసం భారీ ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి ప్రజల మద్దతు కోసం మహారాష్ట్రలోని అట్‌పడీలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.