ఆప్ ఎమ్మెల్యేల అనర్హతకు రాష్ట్రపతి ఆమోదం..!

SMTV Desk 2018-01-21 16:37:26  aam aadhmi party, 20 mlas suspended, election commotion,

న్యూఢిల్లీ, జనవరి 21 : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటీవల ఎన్నికల కమిషన్ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కోరింది. ఆ ఎమ్మెల్యేల౦తా లాభదాయకమైన పదవులలో ఉన్నారంటూ ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ తన ప్రతిపాదనలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించింది. ఆ ప్రతిపాదనకు రాష్ట్రపతి నుండి ఆమోదం లభించింది. 63 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలో.. ప్రస్తుతం 43 మంది ఉన్నారు.