పవన్ తో పోలాండ్ విద్యార్థుల భేటీ..

SMTV Desk 2018-01-21 14:21:01  janasena party, pawan kalyan, poland brand ambassadre aadam.

హైదరాబాద్, జనవరి 21 : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఈ ఉదయం పోలాండ్ విద్యార్థులతో భేటీ అయ్యారు. భార్య అన్నా లెనేజువాతో కలిసి సెయింట్ మేరీస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం తనను కలవడానికి వచ్చిన పోలాండ్ విద్యార్ధులతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన సినిమాల్లో ఎక్కువగా మహిళల విద్య, భద్రతకు ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. చదువులో ఫెయిలయ్యా కాని బాగా చదువుకొని ఉంటే ఒక ఫ్రొఫెసర్ ని అయ్యేవాడిని అంటూ పేర్కొన్నారు. భారత్-పోలాండ్‌ల మధ్య మంచి అనుబంధ౦ ఉందని గుర్తు చేసుకున్నారు. చాలా సినిమాలు పోలాండ్‌ లో చిత్రీకరించామని తెలిపారు. ఈ క్రమంలో పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ రాజకీయాలపై పవన్‌ కు ఉన్న అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు.