పెట్రేగిన పాక్ రేంజర్లు.. సరిహద్దుల్లో కాల్పుల మోత

SMTV Desk 2018-01-20 16:17:45  bharath, pakisthan, firing, jammu kasmir.

జమ్ముకాశ్మీర్, జనవరి 20 : భారత్, పాక్ ల మధ్య సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతోంది. కాల్పల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌ రేంజర్లు పెట్రేగిపోయారు. సరిహద్దుల్లో పలు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతున్నారు. ఈ కాల్పుల్లో భారత జవాను, ఇద్దరు పౌరులు మరణించినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత్ సైనికులు పాకిస్తాన్ కాల్పులను తిప్పి కొడుతున్నారు. అధికంగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే పాక్ ఈ కాల్పులకు తెగబడ్డట్లు తెలుస్తోంది. ఈ కాల్పులు జరుగుతున్న క్రమంలో అఖ్‌నూర్‌ ప్రాంత వాసులు ఇద్దరు గాయపడగా, ఓ బాలికకు స్వల్ప గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు.