జయశంకర్ భూపాలపల్లి, జనవరి 20: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శనివారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్ట్ సందర్శనకు విచ్చేసిన గవర్నర్ కు గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ సిరికొండ మధుసూధనాచారి స్వాగతం పలికారు. ప్రాజెక్టు సమీపంలోని కన్నెపల్లి పంప్ హౌస్కు చేరుకుని నిర్మాణ పనుల వివరాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని సతీమణితో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అన్నారం బ్యారేజీ పనులను వీక్షించేందుకు హెలికాప్టర్లో వెళ్లారు.