సెంచూరియన్, జనవరి 18 : ఒకే టెస్టులో రెండుసార్లు రనౌటైన తొలి భారత ఆటగాడిగా క్రికెటర్ పుజారా చెత్త రికార్డును సృష్టించాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య సెంచూరియన్లో జరుగుతున్న రెండో టెస్టు ఐదో రోజు ఆటలో ఫిలాండర్ వేసిన బంతిని పార్ధీవ్ పటేల్ ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న డివిలియర్స్ దానిని డీకాక్కు పాస్ చేశాడు. డీకాక్ క్షణం ఆలస్యం చేయకుండా.. పుజారా క్రీజులో బ్యాట్ పెట్టే కంటే ముందుగానే వికెట్ ను పడగొట్టాడు. దీంతో పుజారా రనౌట్ అయ్యాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో కూడా పుజారా పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు. దీంతో క్రికెట్ చరిత్రలోనే ఒకే టెస్టులో రెండుసార్లు రనౌట్ అయిన ఘనత సాధించిన మొదటి ఆటగాడు ఆయనే.