న్యూఢిల్లీ, జనవరి 18 : నేటి తరం మహిళలు అన్ని రంగాల్లో ముందుంటూ తమ బాధ్యతలను మర్చిపోకుండా అటు ఉద్యోగానికి, ఇటు కుటుంబానికి ఇష్టంతో పనిచేస్తున్నారు. ఈ తరహాలోనే ఢిల్లీలోని రోహ్తస్ నగర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అయిన సరితా సింగ్కు కొద్ది నెలల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ప్రస్తుతం అక్కడ శీతాకాల శాసనసభ సమావేశాలు జరుగుతుండగా, సరిత తిరిగి హాజరుకావాల్సి ఉన్నందున, రెండు నెలల చంటి బిడ్డతో ఆమె అసెంబ్లీకి వచ్చారు. నెలల చిన్నారి అయిన అద్వైత్ అభినవ్ రాయ్కి ప్రతి రెండు గంటలకోసారి తల్లిపాలు తాగించాల్సి రావడంతో సరిత తనతో పాటు అసెంబ్లీకి తీసుకొచ్చారు. దీంతో ఆమె బిజీగా ఉన్న సమయంలో తోటి ఎమ్మెల్యేలు ఆ చిన్నారిని ఎత్తుకుని ఆడించారు.