ఆరేళ్ళ బాలికపై అత్యాచారం చేసి హత్య

SMTV Desk 2017-06-22 11:37:12  rape, boy, 6years, girl

అలీగడ్, జూన్ 22 : ఈ మధ్యే బీహార్ లో పదవ తరగతి చదువుతున్న బాలిక పై ఆరుగురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన తెలిసిందే. మళ్ళీ అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆరేళ్ళ బాలిక పై అత్యాచారం పాల్పడి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బదౌన్ ప్రాంతానికి చెందిన యువకుడు గతంలో బాలిక తండ్రి వద్ద పని చేసేవాడు. నెల రోజుల క్రితం పని మానేసిన ఆ యువకుడు, అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. తరువాత మళ్ళీ బుధవారం గ్రామానికి వచ్చాడు. బాలిక వాళ్ళ ఇంటికి వెళ్లి తినుబండారాలు కొనిస్తానని చెప్పి నమ్మించి, బాలికను ఆ ఊరు పక్కన ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అక్కడ బాలిక పై అఘాయిత్యానికి పాల్పడి దారుణంగా హత్య చేశాడు. బాలిక ఇంకా ఇంటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెతుకటం మొదలు పెట్టారు. ఈ వెతుకులాటలో అటవీ ప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. పక్కనే మద్యం మత్తులో ఉన్న యువకుడిని కూడా చూసారు. అతన్ని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఆగ్రహానికిలోనై అతని పై దాడి చేసారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోని ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక పై అత్యాచారం చేసి హత్యకు పాల్పడింది యువకుడేనని ధృవీకరించారు.