ముంబై, జనవరి 18 : భారత్, ఇజ్రాయెల్ భాగస్వామ్యం అద్భుతాలు సృష్టిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ముంబైలోని తాజ్ హోటల్లో వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కొత్త ఆవిష్కరణలతోనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, భవిష్యత్ అంతా ఆవిష్కర్తలదే అన్నారు. ఆవిష్కరణలు అనేవి కొత్త ఆలోచనల నుంచి పుట్టుకొస్తాయని.. వాటిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్లో ఉన్న మేము, భారత్లో ఉన్న మీరు మంచి భవిష్యత్తుకు కారకులవ్వాలని కోరారు.