న్యూఢిల్లీ, జనవరి 13: ఆసియా క్రీడలకు సన్నాహకంగా నిర్వహించే అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇండోనేసియాలోని జకార్తాలో ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు ఈ మీట్ జరుగుతుంది. ఈ జట్టులో పురుషుల 4*100 మీటర్ల రిలేలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన అథ్లెట్ సీహెచ్ సుధాకర్కు స్థానం లభించింది. గత కొంతకాలంగా జాతీయ అథ్లెటిక్స్ స్ప్రింట్ రేసుల్లో సుధాకర్ నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది గుంటూరులో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సుధాకర్ 100 మీటర్ల విభాగంలో కాంస్య పతక౦తో మెప్పించాడు.