విహారం@విషాదం..పడవ బోల్తా..40 మంది మృతి

SMTV Desk 2018-01-13 14:17:05  boat accident, 40 members pass away, mumbai.

ముంబై, జనవరి 13 : మహారాష్ట్రలోని ముంబయిలో పెను ప్రమాదం సంభవించింది. విహారయాత్రకు వెళ్లిన 40 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ముంబైలోని దహాను తీరానికి రెండు నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సరదాగా తోటి విద్యార్థులతో కలిసి విహారయాత్రకు బయలుదేరిన పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందగా.. 25 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న సిబ్బంది.. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరికొన్ని పడవలు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు దహను ప్రాంతానికి చేరుకున్నాయి.