సెంచూరియన్, జనవరి 13: భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు రెండో టెస్టు మ్యాచ్ సెంచూరియన్ వేదికగా జరుగుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కేప్టౌన్లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా తుది జట్టు కూర్పు సరిగా లేదని విమర్శలు వచ్చిన నేపధ్యంలో జట్టులో స్వల్ప మార్పులు చేశారు. ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్, భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మ తుది జట్టులోకి వచ్చారు. కేప్టౌన్లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలవడంతో రెండో టెస్టు కీలకంగా మారింది. మూడు టెస్టు మ్యాచ్ల ఈ సిరీస్పై ఆశలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. జట్టులో మార్పులతో దిగిన టీమిండియా ఆటలో ఎంత మార్పు తీసుకు వస్తుందో వేచి చూడాలి.