న్యూఢిల్లీ, జనవరి 13: దేశ వ్యాప్తంగా ఒకేసారి రెండు వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి. రాజస్థాన్లోని జయపురలో శనివారం ఉదయం స్థానిక విద్యానగర్లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా గుజరాత్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. రాజ్కోట్లోని ప్రాణ్స్లా గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో ముగ్గురు బాలికలు మృతిచెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదాలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.