విజయవాడ, జనవరి 12 : స్వామి వివేకానంద సూక్తులు పాటిస్తే ఎంతటి వారైనా జీవితంలో విజయాన్ని సాధిస్తారని భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సూచించారు. విజయవాడలోని మేరీస్ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న కుంబ్లే మాట్లాడుతూ...రాష్ట్రంలో ప్రపంచస్ధాయి క్రీడా సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలను కుంబ్లే కొనియాడారు. క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తాన్నారన్నారు. ప్రపంచ స్ధాయి క్రీడాకారుల రూపకల్పనలో రాష్ట్రానికి తనవంతుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. యువతి యువకులు క్రీడలను అలవర్చుకోవాలని, అవి జీవితంలో క్రమశిక్షణను పెంపొందించడమే కాకుండా ఉన్నత స్ధితికి చేర్చేలా ఉపకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్. వి.సుబ్రమణ్యం, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.