ఆ విషయంలో వెనుక ఉన్నాం :సీఎం చంద్రబాబు

SMTV Desk 2018-01-12 15:09:49  ap cm chandrababu naidu, telangana, karnataka states

విజయవాడ, జనవరి 12 : దక్షిణ రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ కన్నా ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ వెనుక ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ప్రధాని మోదీతో జరిగిన భేటీ అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ...సేవారంగంలో తెలంగాణకు ఆదాయం ఎక్కువని అలాగే, పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయ రంగంలో కూడా ఏపీ ముందుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.42వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని 14వ ఆర్థిక సంఘం చెప్పిందన్నారు. ఈ మేరకు హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించడం వల్లే సమస్యలు ఏర్పడుతున్నాయని ఆయన వెల్లడించారు.