ముంబయి, జనవరి 12 : కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ దక్షిణ ముంబయి ప్రాంతంలో నేవీకి ఇక అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ముంబయిలో సీప్లేన్, ఫ్లోటెల్ సర్వీసులను ప్రారంభించడానికి నేవీ అనుమతి నిరాకరిస్తున్నందున, గడ్కరీ పాక్ సరిహద్దుకు వెళ్లి పెట్రోలింగ్ చేసుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ ముంబయి ప్రాంతంలో కేవలం కీలకమైన, సీనియర్ నేవీ అధికారులు ఉండాలని, కానీ అందరూ అక్కడే ఉండాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా పది వేల సీప్లేన్స్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన వెల్లడించారు. ముంబయిలో సీప్లేన్, ఫ్లోటెల్ సర్వీసులను ప్రారంభించడానికి నేవీ అనుమతి నిరాకరిస్తున్నందున గడ్కరీ ఈ విధంగా మాట్లాడటం జరిగినట్లు సమాచారం.