న్యూ డిల్లీ, జనవరి 12: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించిన నేపధ్యంలో ప్రధాని మోదీ కేంద్ర న్యాయశాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ కు ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రధాన న్యాయమూర్తిపై నలుగురు సుప్రీం న్యాయమూర్తులు విమర్శలు గుప్పించిన నేపధ్యంలో అత్యున్నత న్యాయస్థానం ప్రతిష్ఠ మసకబారకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సుప్రీంకోర్టు లో జరుగుతున్న అవాంఛనీయ ఘటనలను న్యాయమూర్తులు వెల్లడించగా వాటిని సీరియస్ గా తీసుకున్న మోదీ వెంటనే అత్యున్నత సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా న్యాయశాఖా మంత్రిని కోరినట్లు సమాచారం. సుప్రీంకోర్టు పై ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.