రాంచి, జనవరి 12 : పశు దాణా కేసులో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కు హజారీభాగ్లోని ఓపెన్ జైల్లో ఉండడం ఇష్టం లేదని న్యాయమూర్తిని కోరారు. ఇటీవల లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష, పది లక్షల రూపాయల జరిమానా విధిస్తూ సీబీఐ న్యాయమూర్తి శివపాల్ సింగ్ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు ఆ జైల్లో ఉండడం ఇష్టంలేదని కేసు విచారణ సమయంలో న్యాయమూర్తికి విన్నవించారు. "దయచేసి ఆ జైలు నిబంధనలను చూడండి. 60ఏళ్ల పైబడిన వారు గాని ఐదేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడిన వారిని అక్కడ ఉంచుతారు. శిక్ష పడిన వారి ఇష్ట ప్రకారమే అక్కడ ఉంచాలి" అని లాలూ న్యాయమూర్తికి తెలిపారు. కాని అక్కడ కుటుంబసభ్యులతో కలిసి ఉండొచ్చని ఆ జైలు కేటాయించానని తీర్పు సమయంలో న్యాయమూర్తి వెల్లడించారు.