ఇండియా హౌస్‌ విందులో పాల్గొన్న కోహ్లీ సేన..

SMTV Desk 2018-01-12 12:02:03  INDIA CRICKET TEAM, INDIA HOUSE, Centurion

సెంచూరియన్‌, జనవరి 12: భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు శనివారం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సెంచూరియన్‌లోని స్పోర్ట్ పార్క్‌ మైదానంలో జరగనుంది. ఈ నేపథ్యంలో కేప్‌టౌన్‌ నుంచి టీమిండియా జోహన్నెస్‌బర్గ్‌ చేరుకున్నారు. గురువారం ఉదయం ప్రాక్టీస్‌ సెషన్‌లో ఆటగాళ్లు పాల్గొన్నారు. అనంతరం ఇండియా హౌస్‌ సిబ్బంది ఆహ్వానం మేరకు జోహన్నెస్‌బర్గ్‌లో ఉన్న కార్యాలయానికి టీమిండియా ఆటగాళ్లు, జట్టు మేనేజ్‌మెంట్‌ వెళ్లి ప్రత్యేక విందులో పాల్గొంది. కోహ్లీ సేన ఇండియా హౌస్‌ను సందర్శించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా పంచుకుంది.