న్యూఢిల్లీ, జనవరి 11 : భారత మహిళల క్రికెట్ జట్టు వచ్చే నెల ఐదు నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఇందుకోసం బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ఎంపిక చేసింది. జట్టు సారథిగా మిథాలీ రాజ్ వ్యవహరించనుంది. మూడు వన్డేల సిరీస్ తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ-20 సిరీస్ లో తలపడనుంది.ఈ జట్టులో ముంబయికి చెందిన పాఠశాల విద్యార్థిని 17 ఏళ్ల జెమిమా రోడ్రిగ్స్ తొలిసారిగా సీనియర్ జట్టులో చోటు దక్కించుకొంది. టీ-20 జట్టును ఇంకా ప్రకటించలేదు. భారత మహిళల వన్డే జట్టు: మిథాలీరాజ్ (కెప్టెన్), హర్మన్ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), సుష్మ వర్మ (వికెట్ కీపర్), ఏక్తాబిష్ఠ్, స్మృతి మందన, పూనం యాదవ్, పూనం రావత్, రాజేశ్వరి గైక్వాడ్, జెమిమా రోడ్రిగ్స్, జూలన్ గోస్వామి, దీప్తి శర్మ, శిఖా పాండే, మోనా మేశ్రం, పూజా వస్త్రాకర్, వేదా కృష్ణమూర్తి, తనియా భాటియా (వికెట్ కీపర్).