పాట్నా, జూన్ 20: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. లాలూ తనయుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, లాలూ తనయ మీసా భారతిల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది. లాలూప్రసాద్ భార్య రబ్దీదేవి ముఖ్యమంత్రి గా ఉన్నసమయంలో క్విట్ ప్రోగో ద్వారా అనేక అక్రమ ఆస్తులు కూడాబెట్టనారని ఆదాయ పన్నుశాఖ అధికారుల అభియోగం. తేజస్వీ, మీసా, ఆమె భర్త శైలేష్యాదవ్లకు చెందిన భావిస్తోన్న అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు సోమవారం రాత్రి ఒక ప్రకటన చేశారు. బినామీ ఆస్తుల వ్యవహారంలో విచారణ సంస్థ ఎదుట హాజరుకావాల్సిందిగా మీసా భారతికి గతంలో రెండు సార్లు సమన్లు జారీచేశామని, వాటికి ఆమె స్పందించకపోవడంతో దాడులు చేసి ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు తెలిపారు. తాజా వ్యవహారంపై లాలూ స్పందన ఎలా ఉంటుందో చూడాలి అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.