నిద్ర మత్తులో కర్నాటక ముఖ్యమంత్రి..!

SMTV Desk 2018-01-10 14:11:19  KARNATAKA CM, SIDDA RAMAYYA, SLEEPING IN MEDIA MEETING.

బెంగళూరు, జనవరి 10 : ఓ మీడియా కార్యక్రమం జరుగుతుండగా ముఖ్యమంత్రి తూలుతూ నిద్రపోతున్న ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. కర్ణాటక మడికేరిలో నిర్వహించిన కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ముందు వరుసలో కూర్చొని నిద్రపోతున్నారు. అదే సమయంలో ఎవరో ఫోటో క్లిక్ మనిపించారు. అనంతరం సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు సీఎంపై సెటైర్లు వేశారు. పలువురు "సిద్ధ రామయ్య.. ప్లీజ్‌ తొందరగా లేవండి", "పని వేళల్లో నిద్రపోయే అవకాశం కేవలం జపాన్‌లోనే ఉంది" అంటూ హాస్యం పండించారు.