చెన్నై, జనవరి 10 : దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జోయాలుక్కాస్ జ్యూవెల్లరి సంస్థలపై ఐటీ దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ దాడులు చేపట్టారు. ఇప్పటికే చెన్నైలోని షోరూమ్ లలో ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. దక్షిణాదితో పాలు అటు గుజరాత్, హర్యానాల్లోని 130 ప్రాంతాలలో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. భారత్ తో సహా 11దేశాలలో జోయాలుక్కాస్కు బ్రాంచ్ లు ఉన్నాయి. ఇంకా ఏపీ, తెలంగాణ లలో దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మంజలి జ్యూవెల్లరి పై కూడా ఈ దాడులు నిర్వహిస్తున్నామని అధికారులు నిర్వహించారు.