గుంటూరు, జనవరి 9: ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూ, మరో వైపు షోరూమ్ ఓపెనింగ్స్ లలో చాలా చురుగ్గా పాల్గొంటుంది ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్. తాజాగా గుంటూరు జిల్లాలోని కొత్త బస్టాండ్ వద్ద బీన్యూ మొబైల్ సంస్థ 40వ షోరూమ్ను ఆమె ప్రారంభించారు. ఆ తరువాత బీన్యూ సంస్థ ఎండీ వైడీ బాలాజీ చౌదరి, అనూ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... "బాపట్లలో షోరూమ్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, మీ అభిమానం, ఆశీర్వాదం ఎల్లపుడూ ఉండాలని కోరుకుంటున్నాని అన్నారు. రేపు విడుదలయ్యే అజ్ఞాతవాసి చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే చూడండి. పైరసీ ని ప్రోత్సహించోద్దని తెలిపింది. అనంతరం ఆమె అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.