ప్రాణం తీసిన మద్యం మద్యం మత్తు..

SMTV Desk 2018-01-09 13:06:53  car accident, shad nagar, hyderabad

హైదరాబాద్, జనవరి 9: నగరంలో మద్యం మత్తు కారణంగా రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి గణనీయంగా పెరుగుతున్నాయి. మద్యం సేవించి ముగ్గురు స్నేహితులు లాంగ్ డ్రైవ్ కు బయల్దేరి, తిరిగి వస్తుండగా అదుపుతప్పి డివైడర్ ను ఢి కొట్టారు. ఈ ప్రమాదంలో ఒక విద్యార్ధిని మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అనన్య, నితిన్, నిఖిత అనే ముగ్గురు స్నేహితులు, నిన్న నితిన్ పుట్టిన రోజు సందర్బంగా వారు రాత్రాంతా బర్త్ డే పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో ఫుల్ గా మద్యం పుచ్చుకున్న నితిన్ లాంగ్ డ్రైవ్ కి ప్లాన్ వేశాడు. బెంగుళూరు జాతీయ రహదారి వైపు వెళ్తుండగా ఓఆర్ఆర్ పై బూర్జు గడ్డ వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢి కొట్టింది. ఈ ఘటనలో అనన్య అక్కడిక్కడే మరణించింది. ముందు సిట్లో కూర్చున్న నితిన్, నిఖితలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి మద్యం మత్తు కారణమని పోలీసులు తెలిపారు.