ఫ్లైట్‌ ఉద్యోగిని బ్యాగులో రూ.3.21కోట్లు!

SMTV Desk 2018-01-09 13:01:37  jet airways plane, women employe, bag, money, ed

న్యూఢిల్లీ, జనవరి 09: డిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన తనిఖీల్లో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కి చెందిన మహిళా ఉద్యోగి బ్యాగులో అక్రమంగా రూ.మూడు కోట్ల విలువైన అమెరికా డాలర్లను పట్టుకెళుతున్నట్లు తనిఖీ అధికారులు గుర్తించారు. ఆమెను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హాంకాంగ్‌కు చెందిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం సోమవారం రాత్రి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. డీఆర్‌ఐ అధికారులు ఆ సమయంలో తనిఖీ చేయగా జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బందిలోని ఒకరి వద్ద ఉన్న సూట్‌ కేసులో రూ.3.21కోట్ల విలువైన అమెరికన్‌ డాలర్లు లభించాయి. దీంతో ఆమెను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.