కేప్ టౌన్, జనవరి 9 : టీమిండియా క్రికెట్ జట్టు సఫారీ గడ్డపై వచ్చిన ఒక్క అవకాశాన్ని చేజేతుల చేజార్చుకుంది. బౌలర్లు అనుకున్నదాని కంటే బాగా రాణించి ప్రోటీస్ జట్టుని తక్కువ పరుగులకే కట్టడి చేసిన, మన బ్యాట్స్ మెన్ వైఫల్యంతో పరాజయం వెక్కిరించింది. దీంతో అంతర్జాలంలో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ పై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్ జరగబోయే ముందు కూడా సౌతాఫ్రికా లో మంచి రికార్డున్న రహనే ను తప్పించడం పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కేప్ టౌన్ లో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో ధావన్ 16, రోహిత్ శర్మ 11 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్లో ఈ ఇద్దరూ 16, 10 పరుగులు మాత్రమే చేశారు. దీంతో సెంచూరియన్, జొహానెస్బర్గ్ల్లో జరిగే టెస్టుల్లోనైనా రహానె, కేఎల్ రాహుల్ను జట్టులోకి తీసుకోమంటూ సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇస్తున్నారు.