చెన్నై స్మాషర్స్ సెమీస్ ఆశలు సజీవం...

SMTV Desk 2018-01-09 11:32:34  chennai smashers, bemguluru blasters, p.v sindhu, pbl

చెన్నై, జనవరి 9 : డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై స్మాషర్స్ జట్టు బెంగుళూరు బ్లాస్టర్స్ పై విజయం సాధించి సెమీస్ ఆశలు సజీవం చేసుకుంది. చెన్నై జట్టు తను ఎంచుకున్న ట్రంప్ మ్యాచ్ తో సహా, ప్రత్యర్ధి జట్టు ట్రంప్ మ్యాచ్ ను కూడా కైవసం చేసుకోవడం విశేషం. తొలుత బెంగళూరు ట్రంప్‌ మ్యాచైన చెన్నై పురుషుల డబుల్స్‌లో యాంగ్‌ లీ-సుమిత్‌ రెడ్డి జోడీ (చెన్నై), బెంగళూరు జంట బే-రంగ్‌ను ఓడించింది. అనంతరం చెన్నై ట్రంప్‌ మ్యాచైన మహిళల సింగిల్స్‌లో సింధు, గ్లిమోర్‌ను చిత్తు చేసింది. దీంతో చెన్నై 3–(–1)తో ఆధిక్యంలోకి దూసుకు వెళ్లింది. తర్వాత పురుషుల సింగిల్స్‌లో అక్సెల్‌సన్‌ (బెంగళూరు) సెన్‌సోమ్‌బున్‌సుక్‌పై, శుభాంకర్‌ (బెంగళూరు) లెవెర్‌డెజ్‌పై, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–కిమ్‌ సా రంగ్‌ (బెంగళూరు) సింధు–క్రిస్‌ అడ్‌కాక్‌లపై గెలిచినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.