అమరావతి, జనవరి 9 : బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ లేఖలో గేట్స్.. చంద్రబాబుతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రాన్ని వ్యవసాయంలో ఒక ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. అగ్రిటెక్ సదస్సు ఆయన దూరదృష్టికి అద్దం పడుతోందన్నారు. రాష్ట్ర ప్రజలకు అధికశాతం బీమా సౌకర్యం కల్పించడంలో భారత్ లోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కితాబిచ్చారు. ఏపీని ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకోవాల౦టూ సూచించారు. వ్యవసాయ విధానాలను రైతులకు చేరవేసేందుకు తమ వంతుగా కృషి చేస్తానన్నారు.