ఉగ్రవాదులతో ఒకే వేదికపై పాక్ సీఎం..!!

SMTV Desk 2018-01-08 16:20:21  pakisthan cm, parveg khattar, the faa i pakisthan council meeting,

న్యూఢిల్లీ, జనవరి 8 : ఉగ్రనేతలతో రాజకీయనేతలు ఒకే వేదికను పంచుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఉంటోందని అమెరికా తీవ్రంగా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెషావర్‌లోని దిఫా-ఐ-పాకిస్థాన్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఖైబర్‌-ఫంక్తువా ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి పర్వేజ్‌ ఖట్టాక్‌ హాజరయ్యారు. ఇదే సమావేశానికి లష్కర్‌ ఉగ్రవాదనేత అబ్దుల్‌ రహ్మన్‌ మక్కి కూడా హాజరయ్యారు. ఈయన ముంబై దాడుల సూత్రదారి హఫీజ్‌ సయీద్ బంధువు. ఈ సయీద్‌ను పాక్‌లోని పంజాబ్‌ ప్రభుత్వం సభకు హాజరవ్వడాన్ని నిషేధించింది. దీంతో ఆ సభకు సయీద్‌ రాకుండా మక్కీ వచ్చాడు. ఈ విషయం తెలిసిన ఇతర పార్టీల నేతలు పీటీఐ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.