ఏపీలో ఏప్రిల్ 22 నుండి ఎంసెట్..!

SMTV Desk 2018-01-08 14:37:36  ap emct exam, schedule release, educational minister ghanta srinivasarao.

తాడేపల్లిగూడెం, జనవరి 8 : ఏపీలో ఏప్రిల్‌ 22 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు పలు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను వెల్లడించారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం.. ఎంసెట్ ఇంజినీరింగ్‌ ఏప్రిల్‌ 22 నుంచి 25 వరకు, మెడిసిన్‌ పరీక్ష ఏప్రిల్‌ 26న, అలాగే ఐసెట్‌ మే 2న, ఈసెట్‌ మే 3న, పీఈ సెట్‌ మే 4న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామన్నారు. కాకినాడ జేఎన్‌టీయూలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష నిర్వహించనున్నామని, ఎస్వీ యూనివర్శిటీలో ఐసెట్‌ను, అనంతపురం జేఎన్‌టీయూలో ఈసెట్‌ను, ఏఎన్‌యూలో పీఈ సెట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా విద్యార్థులు గమనించాలని సూచించారు.