కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రం దూసుకెళ్తోంది : మంత్రి లక్ష్మారెడ్డి

SMTV Desk 2018-01-08 13:22:41  Health Minister, Laksham Reddy, comments on telangana, kcr.

హైదరాబాద్, జనవరి 8 : అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రపథంలో దూసుకెళ్తోందని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ ఉద్యోగుల సంఘ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన మూడున్నరేళ్లలో రాష్ట్రం.. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రశ్రేణిలో కొనసాగుతోందని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, ఆయా సమస్యలను త్వరలోనే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.