మూడో రోజు ఆటను అడ్డుకున్న వరుణుడు..

SMTV Desk 2018-01-07 20:28:59  INDIA, SOUTH AFRICA, CALLED OFF, DUE TO RAIN,

కేప్ టౌన్, జనవరి 7 : భారత్- సౌతాఫ్రికాల మధ్య తొలి టెస్ట్ మూడో రోజు ఆట వరుణుడి కారణంగా ఒక్క బంతి పడకుండా రద్దయింది. ఉదయం నుండి ఆగుతూ, పడుతూ పడిన వర్షం వల్ల ఆట సాధ్యం కాలేదు. దీంతో చేసేదేమిలేక అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్ లో ప్రొటీస్ జట్టు 286 పరుగులు చేసింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 209 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా జట్టులో హార్దిక్ పాండ్య (93), భువి (25) అండతో కష్టాల్లో ఉన్న కోహ్లి సేనను ఆదుకున్నాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సఫారీ జట్టు 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఆమ్లా(4), రబాడ(2) ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టు 142 పరుగుల ఆధిక్యంలో ఉంది.