మచిలీపట్నం, జనవరి 7 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు చేయడం సరికాదని మంత్రి కొల్లు రవీంద్ర వారిపై ధ్వజమెత్తారు. ఈ మేరకు మచిలీపట్నం తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...తమను ఎస్టీల్లో చేర్చమంటూ విశాఖలోని మత్స్యకారులు చేస్తున్న ఆందోళనపై సీఎం చంద్రబాబు చేసిన సానుకూల వ్యాఖ్యలను వారు వక్రీకరించారని అన్నారు. ప్రస్తుతం మత్స్యకారుల సమస్యల విషయంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఎవరూ భయపడొద్దని మత్స్యాకారులకు ఆయన అభయమిచ్చారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉండడంతో వారు నూరు శాతం తెదేపాకు చేరువవుతారన్న భయం వైకాపా నేతలు అసత్య ప్రచారాలు చేస్తురని మాజీ మంత్రి నరసింహారావు ఆయన వెల్లడించారు.