శ్రీనగర్, జనవరి 7 : జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, భారత్.. "మిత్రులు కండి ప్లీజ్". కనీసం సరిహద్దుల్లో ఉన్న జవాన్ల కోసమైనా మీరు జగడాలన్ని మరిచి మిత్రులు కావాలంటూ కోరారు. ఈ మేరకు అనంత్నాగ్ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ముఫ్తీ మాట్లాడుతూ.. "మన దేశ ప్రధాని మోదీకీ, సరిహద్దుల్లో ఉన్న పాకిస్థానీయులకూ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే. కశ్మీర్ ప్రజలకు సహకరించేందుకు, అలాగే మన జవాన్లను కాపాడుకునేందుకు మంచి పరిష్కార మార్గాలు వెతకండి. చర్చలు జరిపి మిత్రులు కండి" అంటూ బహిరంగ విజ్ఞప్తి చేశారు.