హైదరాబాద్, జనవరి 7: నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన మస్తానీది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంగా గుర్తించారు. తీవ్రగాయాలపాలైన ప్రియారెడ్డిది వైజాగ్, మరో మహిళ అనూష రాజమండ్రికి చెందినవారుగా గుర్తించి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ ముగ్గురు యువతులు ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్నారు. ఇందులో అనూష తన ఇంటికి వెళ్లి రాజమండ్రి నుండి బయల్దేరి శనివారం రాత్రి కూకట్పల్లిలో దిగింది. ఆమెను పికప్ చేసుకున్న మస్తానీ, ప్రియ.. హైటెక్ సిటీ మీదుగా తిరిగి శ్రీనగర్ కాలనీకి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం సేవించి కారును అతివేగంతో నడిపి నిండు ప్రాణాన్ని బలికొన్నాడు డ్రైవర్ విష్ణువర్దన్. పోలీసులు విష్ణువర్ధన్రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.