శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి...

SMTV Desk 2018-01-07 14:33:59  ashok gajapathiraju, tirumala, tirupathi

తిరుమల, జనవరి 7: తిరుమల శ్రీవారిని నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు దర్శించ్చుకున్నారు. ఆయన కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని వీఐపీ దర్శన౦లో స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న మంత్రికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం పండితులు ఆశ్వీరచనాలు పలికి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.