ఢిల్లీ జట్టు కెప్టెన్ గా ప్రదీప్‌ సాంగ్వాన్‌..

SMTV Desk 2018-01-07 14:23:14  RISHIB PANTH, PRADEEP SANGHAWAN, DELHI CAPTAIN, DDCA

న్యూఢిల్లీ, జనవరి 7 : యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ కు ఢిల్లీ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) షాక్ ఇచ్చింది. ఢిల్లీ జట్టు నాయకత్వ పగ్గాల నుండి తొలిగించి అతని స్థానంలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ప్రదీప్‌ సాంగ్వాన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో ఢిల్లీ జట్టు పై ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగిన విదర్భ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. డీడీసీఏలో నెలకొన్న అంతర్గత రాజకీయాల కారణంగా ఈ మార్పు చోటు చేసుకుందని కథనాలు వినిపిస్తున్నాయి. సాంగ్వాన్‌ తన చివరి మ్యాచ్‌ను గతేడాది మేలో ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్ తరపున ఆడాడు. అలాగే నిషేధిత ఉత్ర్పేరకం వాడి పాజిటివ్‌గా తేలిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.