అగ్ని ప్రమాద మృతులకు రూ.5 లక్షల పరిహారం: చంద్రబాబు

SMTV Desk 2018-01-07 14:22:17  fire accident, chandrababu naidu, krishna district.

విజయవాడ, జనవరి 7 : కృష్ణా జిల్లా సూరంపల్లిలో ఇనుప వస్తువుల తయారీ కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను గొల్లపూడి ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించారు. పరిశ్రమలో అగ్నిప్రమాద౦ సంభవించడం చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే తీవ్ర గాయాలైన వారికి రూ.5లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తామన్నారు.