పొగమంచు కారణంగా ప్రమాదం :నలుగురు వెయిట్ లిఫ్టర్లు మృతి

SMTV Desk 2018-01-07 12:40:29  Fog snow, Weight lifters death, delhi

న్యూఢిల్లీ, జనవరి 7 : దేశరాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా జరిగిన రహదారి ప్రయాణంలో నలుగురు జాతీయ క్రీడాకారులు మరణించారు. మరో ప్రపంచస్థాయి చాంపియన్లతో సహా, మొత్తం ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఆరుగురు పవర్ లిఫ్టర్లు పానిపట్ నుంచి నేడు ఉదయం 4 గంటలకు కారులో ఢిల్లీ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు మధ్యలో 1వ నంబరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారి కారు అలీపూర్ సమీపంలో తొలుత డివైడర్‌ను ఆ తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు వెయిట్‌ లిఫ్టర్లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2017 ప్రపంచ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు పసిడి పథకం సాధించి పెట్టిన సాక్ష్యం యాదవ్ సహా, మరో ఇద్దరు క్రీడాకారులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, పోలీసులు క్షేతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు.