తైజు యింగ్‌ కు షాకిచ్చిన సింధు..

SMTV Desk 2018-01-07 11:21:56  pbl, p.v sindhu, won, chennai smashers, ahmadbhad smash masters

చెన్నై, జనవరి 7 : ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో చెన్నై స్మాషర్స్‌ జట్టు 2-1తో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌పై గెలుపొందింది. మొదట పురుషుల డబుల్స్‌లో రెకినాల్డ్‌-నందగోపాల్‌ జంట (అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ )క్రిస్‌ అడకాక్‌- యాంగ్‌లీ ద్వయంపై నెగ్గడంతో అహ్మదాబాద్‌ 1-0కి చేరుకుంది. అనంతరం మ్యాచ్‌లో తెలుగు తేజం పీ.వీ సింధు, ప్రపంచ నంబర్‌వన్‌ తైజు యింగ్‌ను ఓడించడంతో చెన్నై స్కోరు సమం చేసింది. తర్వాత మ్యాచ్‌ను చెన్నై ట్రంప్‌ మ్యాచ్‌గా ఎన్నుకోగా, ఆ జట్టు ఆటగాడు లెవెర్డెజ్‌ సౌరభ్‌ వర్మ చేతిలో ఓడిపోయాడు. అయితే చెన్నై చివరి రెండు మ్యాచ్‌ల్లో పుంజుకుని పోరులో విజేతగా నిలిచింది. మరో సింగిల్స్‌ అహ్మదాబాద్‌కు ‘ట్రంప్‌’ మ్యాచ్ కాగా సెన్సోంబూన్సుక్‌ (చెన్నై), హెచ్. ఎస్ ప్రణయ్‌పై (అహ్మదాబాద్) విజయం సాధించాడు. స్కోరు 1–1తో సమంగా నిలిచిన ఈ దశలో సుమిత్‌ రెడ్డితో కలిసి సింధు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అమీతుమీకి సిద్ధమైంది. ఇందులో చెన్నై జోడీ లీ చన్‌ హీ–కమిల్లా రైటర్‌ (అహ్మదాబాద్‌) జంటను ఓడించి జట్టును గెలిపించింది. నేడు జరిగే పోరులో హైదరాబాద్‌ హంటర్స్‌తో, అవధ్‌ వారియర్స్‌ తలపడనుంది.