రాష్ట్రంలో అవార్డుల పండుగ

SMTV Desk 2017-06-20 15:45:08  Awards, acclaim, delhi parlament, samudrala venugopalachari, nirmal,

నిర్మల్ కల్చరల్, జూన్ 20 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అమలుచేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలకు అనుగుణంగా స్పందిస్తు రాష్ట్రానికి కేంద్రం నుంచి అవార్డులు, ప్రశంసలు అందుతున్నాయని ఢిల్లీలో పార్లమెంట్ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంతి భవనంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నుంచి ఇప్పటివరకు 17 రకాల అవార్డులు వచ్చాయని తెలుపుతూ, రెండు రోజుల్లో మరో ఐదు అవార్డులు రానున్నట్లు తెలిపారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్‌బెడ్‌రూం వంటి పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు పర్చడం లేదన్నట్లు వెల్లడించారు. పెద్దనోట్ల రద్దుతో రూ.4500 కోట్ల నష్టం వచ్చినా మన రాష్ట్రం ఆర్థికంగా నిలదోక్కుకుందని స్పష్టం చేశారు. అమలు చేసిన పథకాలకు ఇప్పటికి మొత్తం 19 అవార్డులను రాష్ట్రం సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు.