కేప్ టౌన్, జనవరి 6 : దక్షిణాఫ్రికా -భారత్ జట్టుల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ తరపున (93: 95 బంతుల్లో 14x4, 1x6) బ్యాట్ తో అలరించిన పాండ్య రెండో రోజు బంతితో కూడా శుభారంభాన్నిచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 209 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీ జట్టు ఓపెనర్లు, మార్ర్కమ్ (34), డీన్ ఎల్గర్(25) మొదటిలో బాగానే ఆడారు. అయితే తర్వాత భారత్ యువ అల్ రౌండర్ పాండ్య తన బౌలింగ్ తో వీరిద్దరని పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం ప్రొటీస్ జట్టు 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో ఆమ్లా(4), రబాడ(2) ఉన్నారు.